Sunday, November 06, 2005

1_3_201 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

నా జరాభారంబుఁ దాల్చిన పుత్త్రుండు రాజ్యంబున కర్హుండును వంశకర్తయునగు శుక్రవచనంబును నిట్టిద యని యయాతి ప్రభృతజనంబుల నొడంబఱిచి పూరు నఖిలభూభారధురంధరుం జేసి యదుప్రభృతులఁ బ్రత్యంతభూములకు రాజులం జేసి తాను వేదవేదాంగపారగు లయిన బ్రాహ్మణులతోడం దపోవనంబునకుం జని యందుఁ గందమూలఫలాశనుండై వన్యంబులయిన ఫలంబుల హవ్యకవ్యంబుల నగ్నిభట్టారకుం బితృదేవతలం దనుపుచు వానప్రస్థవిధానంబుఁ దప్పక శిలోంఛవృత్తి నతిథిభుక్తశేషం బుపయోగించుచు నియతాత్ముండై జితారిషడ్వర్గుండును నయి సహస్రవర్షంబులు దపంబు సలిపి సర్వసంగవిముక్తుండై సర్వద్వంద్వంబులును విడిచి ముప్పదియేండ్లు నిరాహారుండయి యొక్కయేఁడు వాయుభక్షకుం డయి పంచాగ్నిమధ్యంబున నిల్చి యొక్కయేఁడు నీటిలో నేకపాదంబున నిలిచి మహాఘోరతపంబు సేసి దివ్యవిమానంబున దేవలోకంబునం జని యందు దేవర్షిగణపూజితుం డై బ్రహ్మలోకంబునకుం జని యందు బ్రహ్మర్షిగణపూజితుం డై యనేకకల్పంబు లుండి క్రమ్మఱ నింద్రలోకంబునకు వచ్చిన నింద్రుండు వానిం బూజించి యిట్లనియె.

(ఇలా ప్రజలను ఒప్పించి యయాతి తపోవనానికి వెళ్లి తపస్సు చేసి దివ్యవిమానంలో స్వర్గానికి వెళ్లాడు. ఇంద్రుడు అతడిని పూజించి ఇలా అన్నాడు.)

No comments: