Saturday, August 26, 2006

1_7_130 వచనము నచకి - వసంత

వచనము

అని కఱపిన నట్ల చేయుదు నని యమ్మహీపతి వసిష్ఠుం దోడ్కొని యయోధ్యాపురంబున కరిగి సకలప్రజానురాగకరుం డయి యమ్మునివరు నతిభక్తిం బూజించుచుఁ దొల్లి రాక్షసుం డయి మదయంతీసహితంబు వనంబునం గ్రుమ్మరియెడి కాలం బొక్క బ్రాహ్మణ మిథునంబు ఋతుకాలప్రవృత్తి నున్నం గని యాఁ కంటి పెలుచన నందు బ్రాహ్మణుం బట్టికొని భక్షించిన నతిదుఃఖిత యై యాబ్రాహ్మణభార్య పరమపతివ్రత యాంగిరసి యనునది పురుషవియోగంబునం బుత్త్రార్థంబయిన నిజప్రయత్నంబు విఫలం బగుటకు శోకించి వనితాసంభోగంబున నీవును నా పురుషునట్లు పంచత్వంబునుం బొందు మని శాపంబిచ్చి వసిష్ఠువలన నీకుఁ బుత్త్రలాభం బగు నని చెప్పి యగ్నిప్రవేశంబు సేసినం బదంపడి దీని నంతయు మదయంతి వలన నెఱింగినవాఁ డై తనకుఁ బుత్త్రోత్పాదన సామర్థ్యంబు లేమిం దలంచి కల్మాషపాదుండు పుత్త్రార్థి యయి వసిష్ఠున కి ట్లనియె.

(అతడు అంగీకరించి, వసిష్ఠుడిని వెంటబెట్టుకొని అయోధ్యకు వెళ్లాడు. పూర్వం రాక్షసరూపంలో ఉండి తన భార్య మదయంతితో అడవిలో తిరిగే కాలంలో, ఆకలితో, ఒక బ్రాహ్మణ దంపతుల జంటలో భర్తను భక్షించగా అతడి భార్య ఆంగిరసి - వనితాసంభోగంలో నువ్వు కూడా నా భర్తలాగే మరణిస్తావు - అని శపించి - వసిష్ఠుడి వల్ల నీకు పుత్రలాభం కలుగుతుంది - అని చెప్పి అగ్నిప్రవేశం చేసింది. ఈ విషయం మదయంతి ద్వారా తెలుసుకొని కల్మాషపాదుడు వసిష్ఠుడితో ఇలా అన్నాడు.)

No comments: