Saturday, August 26, 2006

1_7_133 సీసము + తేటగీతి నచకి - వసంత

సీసము

వినవయ్య కృతవీర్యుఁ డను జనపతి దొల్లి
        భృగు వంశ యాజ్యుఁ డై పెక్కుక్రతువు
లొనరించి యగణిత ధనదానముల వారిఁ
        దృప్తులఁ గావించి దివికిఁ జనిన
నతనివంశమున వా రతిధనలుబ్ధు లై
        కృతవీర్యు ధనమెల్లఁ గ్లప్తి సేసి
కొని డాఁచియున్నవా రని భార్గవుల నెల్లఁ
        బలికిన భార్గవుల్ భయము వొంది

తేటగీతి

కొంద ఱర్థము వారిక కూర్చి యిచ్చి
రవనిసురవంశ్యులకు నిచ్చి రందుఁ గొంద
ఱెవ్వరికి నీక తమ తమ యిండ్లఁ బాఁతి
కొని సుఖం బుండి రధము లై కొంద ఱందు.

(పూర్వం కృతవీర్యుడనే రాజు భృగువంశ బ్రాహ్మణులకు చాలా ధనం దానం చేశాడు. అతని వంశంవాళ్లు - కృతవీర్యుని ధనమంతా భార్గవులు దాచుకొని ఉన్నారు - అనగా వాళ్లు భయపడి తమ ధనాన్ని ఒకచోట చేర్చి వాళ్లకే ఇచ్చారు. కొంతమంది మాత్రం ధనాన్ని వేరే వంశాల వారికి ఇచ్చారు. కొందరు తమ ఇళ్లలో పాతిపెట్టుకొన్నారు.

No comments: