Saturday, August 26, 2006

1_7_132 వచనము నచకి - వసంత

వచనము

అని తన భార్యయైన మదయంతి యనుదానిని ఋతుమతి సమర్పించిన నదియు వసిష్ఠు ప్రసాదంబున గర్భిణి యయి పండ్రెండేఁడులు గర్భంబు మోచి వేసరి యొక్క యశ్మశకలంబున నుదరభేదనంబుఁ జేసిన నశ్మకుం డను రాజర్షి పుట్టె నట యదృశ్యంతికిం బరాశరుం డుదయించి వసిష్ఠ నిర్మిత జాతకర్మాదికుం డయి పెరుఁగుచు నొక్కనాఁడు రాక్షసభక్షణంబునం దన జనకు పంచత్వంబు దల్లివలన విని కోపదహనదందహ్యమానహృదయుం డయి తపోమహత్త్వంబున నఖిల లోక సంహారంబు సేయుదు నని యున్న మనుమని వారించి వసిష్ఠుం డి ట్లనియె.

(వసిష్ఠుడి ప్రసాదం వల్ల మదయంతి గర్భం ధరించి, పన్నెండేళ్లు మోసి, విసుగు చెంది, ఒక రాతిముక్కతో కడుపు చీల్చుకోగా ఆమెకు అశ్మకుడు జన్మించాడు. అదృశ్యంతికి పరాశరుడు జన్మించాడు. రాక్షసుడి వల్ల తన తండ్రి మరణించాడని తన తల్లి ద్వారా తెలుసుకొని, ఆగ్రహించి, తపోశక్తితో లోకాలను నాశనం చేస్తానని పూనుకొన్నాడు. వసిష్ఠడు మనుమడిని వారించి ఇలా అన్నాడు.)

No comments: