Thursday, November 03, 2005

1_3_107 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

దుహితృస్నేహంబునం జేసి యద్దేవయాని పలుకులు శుక్రుం డతిక్రమింపండు గావున నీనేర్చువిధంబున దానిచిత్తంబు వడసి శుక్రు నారాధించిన నీ కిష్టసిద్ధి యగు నని దేవతలు ప్రార్థించి పంచినం గచుండును దేవహితార్థంబు వృషపర్వుపురంబునకుం జని యచ్చట వేదాధ్యయనశీలుం డయి సకలదైత్యదానవగణోపాధ్యాయుం డయి యున్న శుక్రుం గని నమస్కరించి యిట్లనియె.

(దేవయాని కోరికను శుక్రుడు జవదాటడు కాబట్టి ఆమె మనసు లోబరచుకొని శుక్రుడికి శుశ్రూషచేస్తే కార్యసిద్ధి అవుతుంది అని దేవతలు ప్రార్థించారు. కచుడు వారి హితం కోసం వృషపర్వుడి పురానికి వెళ్లి శుక్రుడిని చూసి నమస్కరించి ఇలా అన్నాడు.)

No comments: