Thursday, November 03, 2005

1_3_111 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ఇట్లు గురుశుశ్రూషాకౌశలంబునఁ గచుండు శుక్రునకుం బ్రియశిష్యుం డై యున్న నెఱింగి దానవులు సహింపనోపక బృహస్పతితోడి యలుక నక్కచు నొక్కనాఁడు హోమధేనువులం గాచుచు వనంబున నేకతంబయున్న వాని వధియించి విశాల సాలస్కంధంబున బంధించి చని రంత నాదిత్యుం డస్తగిరిశిఖరగతుం డగుడు మగుడి హోమధేనువు లింటికి వచ్చిన వానితోడన కచుండు రాకున్న దేవయాని తనమనంబున మలమల మఱుంగుచుం బోయి తండ్రికిట్లనియె.

(ఇది రాక్షసులు సహించలేక, హోమధేనులను కాస్తున్న కచుడిని చంపి ఒక చెట్టుకు కట్టి వెళ్లిపోయారు. సాయంత్రమైనా కచుడు రాకపోవటంతో దేవయాని కలవరపడి శుక్రుడి దగ్గరకు వెళ్లి ఇలా అన్నది.)

No comments: