Saturday, August 12, 2006

1_6_241 వచనము శిరీష - వసంత

వచనము

కుంతియు దాని రెండుభాగంబులు సేసి యం దొక్క భాగంబు భీమునకుం బెట్టి తక్కిన భాగంబు గడమ కొడుకులుం దానును గుడుచుచు నిట్లు ప్రచ్ఛన్ను లై యేకచక్రపురంబున నున్నంత నొక్కనాఁడు ధర్మార్జునయములు భిక్షార్థం బరిగిన నిట కుంతియు భీముండును దమ విడిసిన విప్రగృహంబున నున్నంత నం దొక్కపెట్ట యార్తధ్వని యెగసిన విని కుంతీదేవి యెంతయు సంతాపించి భీమున కిట్లనియె.

(కుంతి ఆ ఆహారాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగం భీముడికి పెట్టేది. మిగిలినది తాను, తక్కిన పాండవులు తినేవారు. ఇలా వారు మారువేషంలో కాలం గడుపుతూ ఉండగా ఒకరోజు ధర్మార్జుననకులసహదేవులు భిక్షకు వెళ్లారు. కుంతి, భీముడు ఇంట్లో ఉండగా ఒక్కసారిగా పెద్ద ఏడుపు వినిపించింది. కుంతి భీముడితో ఇలా అన్నది.)

No comments: