Sunday, August 13, 2006

1_6_280 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని యడిగిన ధర్మతనయునకుఁ గుంతీదేవి యీ యేకచక్రపురంబున బ్రాహ్మణుల బకాసురుండు బాధించుటయుఁ దమ విడిసిన యింటిబ్రాహ్మణుని కైన యాపదయు దానిం దీర్పం బవనతనయు బ్రాహ్మణార్థంబుగాఁ దనసమర్పించుటయుం జెప్పిన విని ధర్మజుండు దుఃఖించి యిది యేమి సాహసంబు సేసితి రొడ్లకొడుకులకుంగాఁ దమకొడుకుల విడుచు దుర్బుద్ధులునుం గలరె యిదిలోకాచారవిరుద్ధంబు మఱి భీమసేనుఁడు మీకు విడువందగియెడు కొడుకే.

(అని అడిగిన ధర్మరాజుకు కుంతీదేవి జరిగిన విషయం చెప్పింది. ధర్మరాజు బాధపడి - ఇదేమి సాహసం? ఇతరుల కొడుకులను రక్షించటానికి తమ కొడుకులను కోల్పోయే దుర్బుద్ధులు ఉన్నారా? భీముడు మీకు విడువదగిన కుమారుడా?)

No comments: