Monday, August 14, 2006

1_7_2 వచనము కిరణ్ - వసంత

వచనము

అ క్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు పాండవులు విప్రవేషంబున నేకచక్రపురంబునందు వేదాధ్యయనంబు సేయుచు విప్రగృహంబున నున్న కొన్నిదినంబులకు నొక్కబ్రాహ్మణుండు ద్రుపదుపురంబుననుండి చనుదెంచి విశ్రమార్థి యైన నాగృహస్థుండు వాని నభ్యాగతపూజల సంతుష్టుం జేసి యున్నంతఁ గుంతీదేవి గొడుకులుం దాను నవ్విప్రు నతిప్రీతి నుపాసించి యయ్యా మీర లెందుండి వచ్చితి రే దేశంబులు రమ్యంబు లెందుల రాజులు గుణవంతు లని యడిగిన న వ్విప్రుం డి ట్లనియె.

(మహాభారతకథ చెపుతున్న ఉగ్రశ్రవసుడు శౌనకాదిమునులకు భీముడు బకాసురుడిని వధించేవరకూ జరిగినకథను వివరించాడు. తరువాత వారు ఏకచక్రపురంలో ఉంటున్న సమయంలో ద్రుపదరాజు పట్టణం నుండి ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. కుంతి, పాండవులు అతడిని సేవించి - అయ్యా! మీరు ఎక్కడినుండి వచ్చారు? ఏ దేశాలు అందమైనవి? ఏ రాజులు గుణవంతులు? - అని అడిగారు. అతడు ఇలా చెప్పాడు.)

No comments: