Wednesday, August 16, 2006

1_7_22 ఉత్పలమాల కిరణ్ - వసంత

ఉత్పలమాల

మానితు లైన పాండవకుమారులుఁ గుంతియు లక్కయింట ను
గ్రానలదగ్ధు లై రని ధరామరముఖ్యు లెఱింగి చెప్పఁగా
నా నరనాయకుండు విని యాతత శోకమహానలజ్వల
న్మానసుఁ డయ్యె బంధుజనమంత్రిపురోహిత విప్రసన్నిధిన్.

(కుంతి, పాండవులు లక్కయింట్లో చనిపోయారన్న వార్త విని ద్రుపదుడు దుఃఖించాడు.)

No comments: