Saturday, December 09, 2006

1_8_292 తేటగీతి వోలం - వసంత

తేటగీతి

మయుఁడు నశ్వసేనుండును మందపాల
సుతులు నలుగురు శార్జ్గకు లతులదావ
దాహభీతి కయ్యార్వురుఁ దప్పి రన్య
జీవులెల్ల నం దపగతజీవు లైరి.

(మయుడు, అశ్వసేనుడు, మందపాలుని కుమారులైన నలుగురు శార్ఙ్గకులు - మొత్తం ఆరుమంది తప్ప మిగిలిన ప్రాణులన్నీ ఆ దావాగ్నిలో మరణించాయి.)

No comments: