Saturday, December 09, 2006

1_8_300 వచనము వోలం - వసంత

వచనము

అనిన విని మందపాలుండు మర్త్యలోకంబునకుఁ దిరిగివచ్చి నాకుం జెచ్చెరం బెక్కండ్రుపుత్త్రుల నెవ్విధంబునం బడయనగునో యని చింతించి పక్షులయందు వేగంబ యపత్యంబు పెద్దయగుటం జూచి తానును శార్జ్గకుం డై జరిత యను లావుక పెంటి యందు రమియించి దానివలన జరితారి సారిసృక్కస్తంబమిత్రద్రోణు లనువారల నలువురఁ గొడుకులఁ బరమబ్రహ్మవిదులం బడసి వారల ఖాండవంబునం బెట్టి తనపూర్వభార్యయైన లపితయుం దానును విహరించుచు నొక్కనాఁడు ఖాండవదహనోద్యతుండై వచ్చుచున్న యగ్నిభట్టారకుం గని యగ్ని సూక్తంబుల స్తుతియించి యి ట్లనియె.

(ఇది విని, మందపాలుడు మానవలోకానికి తిరిగివచ్చి, పక్షులలో సంతానం చాలా ఎక్కువగా ఉండటం చూసి, మగ లావుక పక్షిరూపం ధరించి, జరిత అనే ఆడ లావుక పక్షితో నలుగురు కుమారులను పొందాడు. వారిని ఖాండవవనంలో ఉంచి, తన మొదటి భార్య లపితతో విహరిస్తూ, ఆ వనాన్ని దహించటానికి వస్తున్న అగ్నిహోత్రుడిని చూసి, ఇలా అన్నాడు.)

No comments: