Sunday, December 10, 2006

1_8_321 వచనము వోలం - వసంత

వచనము

ఇంద్రుండు నుపేంద్రార్జునుల నతి స్నేహంబునఁ గౌఁగిలించుకొని యర్జునునకు నాగ్నేయవారుణవాయవ్యాదిదివ్యబాణంబు లిచ్చి వీని కెప్పుడు నిష్టసఖుండ వయి యుండు మని కృష్ణుం బ్రార్థించి దివ్యవిమానారూఢుం డయి దివిజాప్సరోగణసేవితుం డయి దివంబున కరిగె నిట వాసుదేవార్జునులు మయుం దోడ్కొని మగిడి యింద్రప్రస్థపురంబునకు వచ్చి ధర్మరాజునకు మ్రొక్కి ఖాండవదహనప్రకారంబు సెప్పి మయుం జూపి సుఖం బుండి రని.

(ఇంద్రుడు అర్జునుడికి దివ్యాస్త్రాలు ఇచ్చి - ఎప్పుడూ అర్జునుడికి ప్రియమిత్రుడివై ఉండు - అని కృష్ణుడిని ప్రార్థించి, స్వర్గానికి వెళ్లాడు. కృష్ణార్జునులు కూడా మయుడిని వెంటబెట్టుకొని ఇంద్రప్రస్థానికి వచ్చి, ధర్మరాజుకు ఖాండవదహనం గురించి చెప్పి, మయుడిని పరిచయం చేసి, సుఖంగా ఉన్నారు.)

No comments: