Saturday, August 12, 2006

1_6_272 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

పెద్దకాలంబునకు నీ యిలువరుస నేఁడు మాకు వచ్చె ని చ్చిఱుత వాని నా రాక్షసునకు భక్ష్యంబుగాఁ బుచ్చనోప నేన పోయెద నని దుఃఖించి పలికిన బ్రాహ్మణునకుఁ గుంతి యిట్లనియె నయ్యా దీనికి సంతాపింపవలవ దీయాపద దలఁగునట్టి యుపాయంబు గంటి నీకుం గొడు కొక్కరుండ వాఁడును గడుబాలుండు బలిగొనపోవ నర్హుండు గాఁడు నా కేవురుగొడుకులు గలరు వారలలో నొక్కరుం డారక్కసునకు భవదర్థంబుగా బలిగొని పోయెడు ననిన దాని విననోడి బ్రాహ్మణుండు చెవులు మూసికొని యి ట్లనియె.

(చాలా కాలానికి ఈ ఇంటివరుస మా యింటికి వచ్చింది. ఈ బాలుడిని ఆహారంగా పంపలేను. నేనే పోతాను - అని పలుకగా కుంతి - అయ్యా! దీనికి దుఃఖించవద్దు. నీకు ఒక్కడే కొడుకు. బకుడికి బలిగా అర్హుడు కాడు. నాకు ఐదుగురు కొడుకులు. వారిలో ఒకడు ఈ బలి తీసుకొని వెళ్లగలడు - అని అంటూండగానే ఆ బ్రాహ్మణుడు ఆ మాటలు వినలేక చెవులు మూసుకొని ఇలా అన్నాడు.)

No comments: