Saturday, December 02, 2006

1_8_64 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అని పౌరులెల్ల దీవించుచుండఁ బౌరవకులనందను లయిన పాండునందనులు వచ్చి భీష్మధృతరాష్ట్రాదికురువృద్ధులకు మ్రొక్కి సకలజనానురాగం బొనరించుచు దుర్యోధనాదులతోఁ గలసి యెప్పటియట్ల రాజ్యవిద్యావినోదంబుల నేనుసంవత్సరంబు లుండు నంత నొక్కనాఁడు ధృతరాష్ట్రుండు భీష్మవిదురద్రోణదుర్యోధనాదుల సమక్షంబున బాండవుల కి ట్లనియె.

(అని ప్రజలు ఆశీర్వదించగా పాండవులు వచ్చి ఐదు సంవత్సరాలు హస్తినాపురంలో గడిపారు. ఒకరోజు ధృతరాష్ట్రుడు పెద్దల సమక్షంలో పాండవులతో ఇలా అన్నాడు.)

No comments: