Friday, April 14, 2006

1_5_248 వచనము చేతన - వసంత

వచనము

అ క్కుమారుల ధను ర్విద్యా కౌశలం బెఱుంగ వేఁడి యొక్కనాఁడు ద్రోణుండు కృత్రిమం బయిన భాసం బను పక్షి నొక్క వృక్ష శాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి దాని నందఱుకుఁ జూపి మీమీ ధనువులు బాణంబులు సంధించి నా పంచిన యప్పుడ యిప్పక్షి తలఁ దెగ నేయుం డే నొకళ్లొకళ్లన పంచెద నని ముందఱ ధర్మనందనుం బిలిచి యీ వృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి మద్వచనానంతరంబున శరమోక్షణంబు సేయు మనిన నతండును వల్లె యని గురువచనంబు సేసి యున్న నయ్యుధిష్ఠిరునకు ద్రోణుం డి ట్లనియె.

(కురుకుమారుల విలువిద్యను తెలుసుకోవటానికి ద్రోణుడు ఒకనాడు భాసమనే పక్షిని ఒక చెట్టు కొమ్మ చివరన కట్టి, ముందుగా ధర్మరాజును పిలిచి.)

No comments: