Friday, April 14, 2006

1_5_251 వచనము చేతన - వసంత

వచనము

అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి నీదృష్టి చెదరె నీవు దీని నేయనోపవు పాయు మని యవ్విధంబున దుర్యోధనాదు లైన ధార్తరాష్ట్రులను భీమసేన నకుల సహదేవులను నానాదేశాగతు లైన రాజపుత్త్రులను గ్రమంబున నడిగిన వారలు ధర్మనందను చెప్పినట్ల చెప్పిన నందఱ నిందించి పురందరనందనుం బిలిచి వారి నడిగిన యట్ల యడిగిన నాచార్యునకు నర్జునుం డి ట్లనియె.

(నీ దృష్టి చెదిరింది - అని నిందించి ద్రోణుడు ధర్మరాజును పక్కకు తప్పుకొమ్మన్నాడు. మిగిలిన వారు కూడా ఆ సమాధానమే ఇచ్చారు. ద్రోణుడు అర్జునుడిని పిలిచి అదే ప్రశ్న అడిగాడు.)

No comments: