Monday, November 27, 2006

1_7_239 వచనము ప్రకాష్ - వసంత

వచనము

వీరు కుంతీమహాదేవు లని తన్నునుం దమ్ములనుం దల్లిని నెఱింగించిన ద్రుపదుం డతిహర్షరసావేశ పరవశుం డయి పెద్దయుంబ్రొద్దునకుఁ దెలిసి యానందజలభరితనయనుం డగుచు నా పుణ్యంబున లాక్షాగృహదాహంబువలన విముక్తుల రయితి రని సంతసిల్లి తద్వృత్తాంతం బంతయు ధర్మతనయునివలన విని ధృతరాష్ట్ర దుర్యోధనుల నిందించి సామప్రియభాషణంబుల నభీష్టసత్కారంబులను వారిం బూజించి యొక్కనాఁడు పుత్త్రమిత్రామాత్యబాంధవబ్రాహ్మణపరివృతుం డయి ద్రుపదుండు సుఖాసీను లయి యున్న పాండవుల కి ట్లనియె.

(ద్రుపదుడు వారు లాక్షాగృహదహనం నుంచి తప్పించుకున్నందుకు సంతోషించి ధృతరాష్ట్ర దుర్యోధనులను నిందించి పాండవులను పూజించాడు. తరువాత ఒకరోజు పాండవులతో ఇలా అన్నాడు.)

No comments: