Tuesday, November 28, 2006

1_7_267 వచనము నచకి - వసంత

వచనము

అట వైవస్వతుండును నైమిశారణ్యంబున సత్త్రయాగ దీక్షితుం డయి ప్రాణిహింస సేయకుండుటం జేసి మానవు లప్రాప్తమరణు లయి వర్తించుచున్న దాని సహింపనోపక యింద్రాదిదేవత లందఱు బ్రహ్మపాలికిం జని భట్టారకా మర్త్యు లమర్త్యు లయి వర్తిల్లువా రయిన వారికిని మాకును విశేషం బెద్ది యని దుఃఖించిన నయ్యమరుల కమరజ్యేష్ఠుం డి ట్లనియె.

(అక్కడ యముడు నైమిశారణ్యంలో సత్రయాగదీక్ష వహించి ప్రాణిహింస మానటం వల్ల మానవులు మరణం లేకుండా జీవించసాగారు. ఇది సహించలేక ఇంద్రుడు దేవతలతో బ్రహ్మ దగ్గరకు వెళ్లి బాధపడగా బ్రహ్మ ఇలా అన్నాడు.)

No comments: