Monday, December 04, 2006

1_8_120 వచనము వోలం - వసంత

వచనము

ఇ ట్లరిగి యర్జునుం డతివీరు లయిన చోరుల వధియించి బ్రాహ్మణునకు గోధనంబు నిచ్చి క్రమ్మఱి వచ్చి ధర్మరాజునకు మ్రొక్కి లోకంబులమర్యాదలు విచారించి రక్షించుచున్న మనయందు మర్యాదాభంగం బయ్యె నను నింత కంటె దుర్యశం బొండెద్దియు లేదు గావున నాకు ద్వాదశమాసికవ్రతంబు సలుపవలయు నని పోవ సమకట్టి యున్న నర్జునునకు యుధిష్ఠిరుం డి ట్లనియె.

(ఇలా అర్జునుడు ఆ దొంగలను చంపి, బ్రాహ్మణుడికి గోవును అప్పగించి, తిరిగి వచ్చి, ధర్మరాజుకు మొక్కి - నియమభంగం జరిగినందుకు నేను ద్వాదశమాసికవ్రతాన్ని చేయాలి - అనగా ధర్మరాజు ఇలా అన్నాడు.)

No comments: