Tuesday, November 01, 2005

1_3_92 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

పురూరవుండును రాజ్యగర్వంబున నమ్మునులకు దర్శనం బీనొల్లక పరిహసించిన నలిగి వారలు వాని నున్మత్తుంగా శపియించిన వాఁడు గంధర్వలోకంబున నూర్వశీ సహితుండై యుండె నట్టి పురూరవునకు నూర్వశికి నాయువు ధీమంతుండు నమావసువు దృఢాయువు వనాయువు శతాయువు నను నార్వురు గొడుకులు పుట్టి రం దాయువునకు స్వర్భానవి యను దానికి నహుష వృద్ధశర్మ రజి గయానేనసు లనంగా నేవురు పుట్టిరి వారి యందు నహుషుండు రాజ్యాభిషిక్తుం డై.

(పురూరవుడు వారికి దర్శనమివ్వక వారిని పరిహసించాడు. వారు కోపంతో పురూరవుడు వెర్రివాడిగా మారాలని శపించారు. తరువాత ఊర్వశీపురూరవులకు ఆరుగురు కుమారులు జన్మించారు. వారిలో ఆయువు అనే అతడికి నహుషుడు మొదలుగా అయిదుమంది పుట్టారు. నహుషుడు ప్రభువై.)

No comments: