Monday, April 10, 2006

1_5_137 వచనము వసు - వసంత

వచనము

అ క్కశ్యపుండును జనుదెంచి పృథా మాద్రీ సహితుం డయి యున్న యప్పాండురాజుం గని వసుదేవు సందేశంబుఁ జెప్పి యక్కుమారులకు రత్నభూషణాంబరంబు లిచ్చి క్రమంబునఁ జౌలోప నయనంబు లొనరించి వేదాధ్యయనంబు సేయించుచున్నంత వసంతసమయం బఖిలజీవలోకానందజననం బై యేర్పడం జనుదెంచిన.

(వసుదేవుడి సందేశాన్ని కశ్యపుడు వారికి వినిపించి, వారి చేత వేదాధ్యయనం చేయిస్తూ ఉండగా వసంతకాలం వచ్చింది.)

No comments: