Tuesday, April 11, 2006

1_5_152 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

ముని సహస్ర పరివృతులయి జననీ సహితంబు పాండురాజ కుమారులు రాజమార్గంబు దఱియవచ్చి రాజమందిర ద్వారాసన్నులగు నంత మంత్రి పురోహిత బ్రాహ్మణ నివహంబులు దుర్యోధన దుశ్శాసన ప్రముఖ ధార్తరాష్ట్ర శతంబును నెదురు వచ్చి పాండవులం దోడ్కొని తెచ్చిన భీష్మ విదుర ధృతరాష్ట్ర సత్యవత్యంబికాంబాలికలు మొదలుగా నమ్మునులకు నమస్కరించి రంతం దమకు మ్రొక్కిన కుమారుల నతిస్నేహంబున నెత్తికొని కుంతిని బ్రియపూర్వకంబున సంభావించి పాండురాజవియోగదుఃఖితు లయి మహాశోకంబునం దేలుచున్న విదుర ధృతరాష్ట్రుల గాంధారీ సహితం బూరార్చి యమ్మునులయం దొక్కవృద్ధతపస్వి మునిసహస్రానుమతంబున ని ట్లనియె.

(పాండురాజు కుటుంబంలోని వారందరూ వచ్చి కుంతిని, పాండవులనూ గౌరవించారు. దుఃఖిస్తున్న వారిని మునులు ఓదార్చి.)

No comments: