Wednesday, April 12, 2006

1_5_196 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు ననంతరంబు భరద్వాజ సఖుం డైన పృషతుం డను పాంచాలపతి మహాఘోరతపంబు సేయుచు నొక్కనాఁడు దన సమీపంబున వాసంతికాపచయవినోదంబున నున్న యప్సరస మేనక యను దానిం జూచి మదనరాగంబున రేతస్కందం బయిన దానిం దన పాదంబునఁ బ్రచ్ఛాదించిన నందు ద్రుపదుం డను కొడుకు మరుదంశంబునఁ బుట్టిన వాని భరద్వాజాశ్రమంబునఁ బెట్టి చని పృషతుండు పాంచాలదేశంబున రాజ్యంబు సేయుచుండె ద్రుపదుండును ద్రోణునితోడ నొక్కట వేదాధ్యయనంబు సేసి విలువిద్యయుం గఱచి యా పృషతు పరోక్షంబునం బాంచాలదేశంబున కభిషిక్తుం డయ్యె ద్రోణుండును నగ్నివేశ్యుం డను మహామునివలన ధనుర్విద్యా పారగుం డై తత్ప్రసాదంబున నాగ్నేయాస్త్రం బాదిగా ననేకదివ్యబాణంబులు వడసి భరద్వాజు నియోగంబునఁ బుత్రలాభార్థంబు కృపుని చెలియలిఁ గృపి యనుదాని వివాహం బయి దానియం దశ్వత్థామ యను కొడుకుం బడసి యొక్కనాఁడు.

(భరద్వాజుడి స్నేహితుడైన పృషతుడనే పాంచాలదేశపు రాజు మేనక అనే అప్సరసను చూసి కామించాడు. వారికి ద్రుపదుడనే పుత్రుడు జన్మించాడు. ద్రుపదుడు, ద్రోణుడితో కలిసి చదివి, పృషతుడి తరువాత పాంచాలదేశానికి రాజు అయ్యాడు. ద్రోణుడు కృపుడి చెల్లెలైన కృపిని వివాహమాడాడు. వారికి అశ్వత్ధామ జన్మించాడు.)

No comments: