Monday, November 13, 2006

1_7_210 వచనము ప్రకాష్ - వసంత

వచనము

అట్టి యవసరంబునఁ దల్లియొద్దకు ధర్మరాజును గవలవారు మున్న వచ్చియున్నఁ దదనంతరంబ భీమార్జునులు ద్రౌపదీసహితు లయి చనుదెంచి మ్రొక్కి మే మొక్క భిక్ష దెచ్చితి మని తల్లికి నివేదించిన నెఱుంగక యప్పటి యట్ల కా వగచి కుంతీదేవి సంతసిల్లి దాని మీ రేవురు నుపయోగింపుఁ డని కొడుకుల నియోగించి భువన త్రయ రాజ్య లక్ష్మియం బోలె నున్న యక్కన్నియం జూచి లజ్జించి యధర్మభీత యయి ధర్మతనయున కి ట్లనియె.

(మేమొక భిక్ష తెచ్చాము - అని తల్లితో అన్నారు. ఆమె ఆ భిక్ష గురించి తెలియక - దానిని మీరు అయిదుగురు ఉపయోగించండి - అని కొడుకులను ఆజ్ఞాపించింది. తరువాత ఆ కన్యను చూసి, సిగ్గుపడి, అధర్మానికి భయపడి, ధర్మరాజుతో ఇలా పలికింది.)

No comments: