Monday, November 27, 2006

1_7_237 వచనము ప్రకాష్ - వసంత

వచనము

మఱియుం దనయొద్దకు వచ్చి యశంకితు లయి క్షత్త్రియోచితంబు లైన మహార్హాసనంబుల నున్నవారల రాజపుత్త్రులంగా నెఱింగియు సంశయాపనోదనపరుండై ధర్మతనయునకు ద్రుపదుం డి ట్లనియె నయ్యా క్షత్త్రియులరో బ్రాహ్మణులరో మాయావు లయి క్రుమ్మరుచున్న మంత్రసిద్ధులరో కాక కృష్ణాపరిగ్రహణార్థంబు దివంబుననుండి వచ్చిన దివ్యులరో యెఱుంగము మాకు సందేహం బయి యున్నయది మీ కలరూ పెఱింగి కాని యిక్కన్య వివాహంబు సేయనేర మనిన ద్రుపదునకు ధర్మతనయుం డి ట్లనియె.

(అయినా సందేహం తీర్చుకోవటానికి ద్రుపదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు - అయ్యా! మీరు క్షత్రియులా? బ్రాహ్మణులా? మాయావులైన మంత్రసిద్ధులా లేక ద్రౌపదిని వరించటానికి వచ్చిన దేవతలా? మాకు సందేహంగా ఉన్నది. మీ నిజరూపం తెలుసుకొని కానీ ఈమె వివాహం చేయలేము - అని ద్రుపదుడు పలుకగా ధర్మరాజు ఇలా అన్నాడు.)

No comments: