Sunday, November 19, 2006

1_7_222 వచనము ప్రకాష్ - వసంత

వచనము

సకలరాజసమక్షంబున నిట్టి యతిమానుషం బయిన యద్భుతకర్మం బర్జునునక కా కన్యులకుఁ జేయ శక్యంబె యని యెఱింగింతిమి మీపరాక్రమంబు మిమ్ము నెఱింగించె నధర్మనిరతు లగు ధృతరాష్ట్రదుర్యోధనులు సేసిన లాక్షాగారదాహప్రయోగంబువలన విముక్తుల రయితి రింక మీకు లగ్గగు నని చెప్పి బలదేవసహితం డయి వానుదేవుం డరిగిన నిట ద్రుపదుండు దన కూఁతునకు వరుం డైన వాఁ డెవ్వఁడో యేవంశంబునవాఁడో వానిచరితం బెట్టిదో యెఱింగి రమ్మని ధృష్టద్యుమ్నుం బనిచిన నతండు భీమార్జునద్రౌపదుల పిఱుందన వచ్చి తన్నొఱు లెఱుంగకుండ నక్కుంభకారగృహంబున నుండి యంత వృత్తాంతంబు నెఱింగిపోయి ద్రుపదున కి ట్లనియె.

(అందరు రాజులముందు మానవులకు అసాధ్యమైన పని చేయటం అర్జునుడికి కాక ఇతరులకు సాధ్యమా? మీ పరాక్రమమే మిమ్మల్ని తెలియపరచింది. ఇక మీకు మేలు జరుగుతుంది - అని చెప్పి బలరాముడితో కూడి కృష్ణుడు వెళ్లిపోయాడు. ఇక్కడ ద్రుపదుడు తన కుమార్తెకు భర్త అయినవాడు ఎలాంటివాడో తెలుసుకొని రమ్మని ధృష్టద్యుమ్నుడిని పంపాడు. అతడు ఈ వృత్తాంతమంతా తెలుసుకొని వెళ్లి ద్రుపదుడితో ఇలా చెప్పాడు.)

No comments: