అనవుడు నద్దివ్యపురుషు వచనంబున నత్తురంగంబు నెక్కి తత్క్షణంబ యయ్యుదంకుండు గురుగృహంబునకు వచ్చె నిట గురుపత్నియు శుచిస్నాతయై నూతనపరిధానశోభితయై యక్కుండలంబులు దొడువ నవసరంబైనఁ దదాగమనంబు గోరుచున్నయది యప్పు డయ్యుదంకుం గని తద్దయు సంతసిల్లి తదానీతరత్నకుండలభూషితయై బ్రాహ్మణులం బూజించి నిజసంకల్పితమహోత్సవం బొనరించె నట్లు గురుకార్యంబు నిర్వర్తించి యున్న యుదంకుం జూచి గురుం డిట్లనియె.

(అప్పుడు ఉదంకుడు ఆ గుర్రమెక్కి తక్షణమే గురుగృహం చేరాడు. పవిత్రస్నానం చేసి, నూతనవస్త్రాలు ధరించి కుండలాలకోసం ఎదురుచూస్తున్న గురుపత్నికి ఉదంకుడు ఆ కర్ణాభరణాలు అందించగా ఆమె తాను అనుకున్న పూజ పూర్తిచేసింది. గురుకార్యాన్ని పూర్తిచేసిన ఉదంకుడిని చూసి పైలుడు ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment