త్రేతాగ్ను లెల్లను దేజరిల్లమిఁ జేసి
క్రతుకృత్యములు వినిర్గతము లయ్యె
నగ్నిహోత్రములందు నౌపాసనాది సా
యంప్రాతరాహుతు లంత నుడిగె
దేవతార్చనలందు దీపధూపాది స
ద్విధులు వర్తిల్లక విరతిఁ బొందెఁ
బితృకార్యములఁ బితృపిండయజ్ఞక్రియ
లడఁగె విఛ్ఛిన్నంబు లై ధరిత్రి
ఆటవెలది
నంత జనులు సంభ్రమాక్రాంతులై మహా
మునుల కడకుఁ జనిరి మునులు నమర
వరులకడకుఁ జనిరి వారును వారును
బ్రహ్మకడకుఁ జనిరి భయము నొంది.

(అగ్ని ప్రజ్వరిల్లకపోవడం చేత లోకాల్లో కార్యాలన్నీ ఆగిపోయాయి. ప్రజలు సంభ్రమంతో మునుల వద్దకు వెళ్లారు. మునులు దేవతల దగ్గరకు వెళ్లారు. మునులూ, దేవతలూ భయపడి బ్రహ్మ వద్దకు వెళ్లారు.)
No comments:
Post a Comment