ఏను సహస్రపాదుండను మునిముఖ్యుండ నాసహాధ్యాయుండు ఖగముండను మునిముఖ్యుం డగ్నిహోత్రగృహంబున నున్న నే నపహాసార్థంబు తృణమయసర్పం బమ్మునిపై వైచిన నతం డులికిపడి నా కలిగి నీవు నిర్వీర్యంబైన యురగంబ వగుమని శాపం బిచ్చిన నేనును మేలంబు సేసిన నింత యలుగనేల క్షమియింపుమనినం బ్రసన్నుండై ఖగముండు నా వచనం బమోఘంబు గావునఁ గొండొక కాలంబు డుండుభంబవై యుండి భార్గవ కులవర్ధనుండైన రురుం గనిన యప్పుడు శాపవిముక్తుండ వగుదు వనెనని సహస్రపాదుండు రురునకుఁ దన వృత్తాంతం బంతయుం జెప్పి వెండియు నిట్లనియె.

(నేను సహస్రపాదుడనే మునిని. ఖగముడనే నా సహపాఠిపై పరిహాసానికై గడ్డితో చేసిన ఒక పామును వేయగా అతడు భయపడి, నాపై కోపించి, శక్తిలేని పామువుకమ్మని శపించాడు. వేళాకోళానికి చేశాను, మన్నించమనగా ఆతడు ప్రసన్నుడై, "నా పలుకు వ్యర్థం కాదు కాబట్టి ఇలా కొంతకాలం ఉన్న తరువాత భృగువంశానికి చెందిన రురుడిని చూసినప్పుడు నీకు విముక్తి కలుగుతుంది", అని అన్నాడని పలికి ఇలా అన్నాడు. )
No comments:
Post a Comment