Tuesday, August 30, 2005

1_1_158 వచనము కృష్ణ - విజయ్

వచనము

అయ్యా నీవు బ్రాహ్మణుండవు భృగువంశసముత్పన్నుండవు సర్వగుణసంపన్నుండ విది యేమి దొడంగి తిట్టి దారుణక్రియారంభంబు క్షత్రియులకుం గాక బ్రాహ్మణులకుం జనునే బ్రహ్మణు లహింసాపరు లొరులు సేయు హింసలు వారించు పరమకారుణ్యపుణ్యమూర్తులు జనమేజయుండను జనపతి చేయు సర్పయాగంబునందుఁ గద్రూశాపంబున నయ్యెడు సర్పకులప్రళయంబును భవత్పిత్రు శిష్యుండయిన యాస్తీకుండను బ్రాహ్మణుండ కాఁడె యుడిగించె నని చెప్పి సహస్రపాదుండు రురునకు సర్పఘాతంబునందుపశమనబుద్ధి పుట్టించె ననిన విని శౌనకాదిమహామును లక్కథకున కిట్లనిరి.












("అయ్యా! గొప్పవాడివైన నీవు ఇలా చేయటం ఎందుకారంభించావు? బ్రాహ్మణులు అహింసాపరులు, ఇతరులు చేసే హింసను ఆపే దయగలవారు. జనమేజయుని సర్పయాగంలో నాగులకు జనని అయిన కద్రువ శాపం వల్ల జరిగే సర్పవినాశనాన్ని నీ తండ్రి శిష్యుడైన ఆస్తీకుడే కదా వారించింది?", అని సహస్రపాదుడు పలికి రురుడికి సర్పఘాతయత్నం మానివేసే బుద్ధి కలిగించాడు అని కథకుడు చెప్పగా విని శౌనకాదిమహర్షులు అతడిని ఇలా అడిగారు.)

No comments: