Saturday, August 27, 2005

1_1_81 వచనము విజయ్ - ఆదిత్య

ఇరువది యొక్కవేయు నెనమన్నూట డెబ్బది రథంబులు, నన్ని యేనుంగులు, నఱువదేనువేలు నాఱునూటపది గుఱ్ఱంబులు, లక్షయుం దొమ్మిదివేలున్ మున్నూట యేఁబండ్రు వీరభటులును గలయది యొక్క యక్షౌహిణి యయ్యె; నట్టి యక్షౌహిణులు పదునెనిమిదింట సన్నద్ధులై కురుపాండవులు యుద్ధంబు సేయుటం జేసి యా శమంతపంచకంబు కురుక్షేత్రంబు నాఁబరగె; నట్టి కురుక్షేత్రంబునందు.

(21870 రథాలు, 21870 ఏనుగులు, 65610 గుర్రాలు, 109350 మంది భటులు కల సైన్యవిభాగం ఒక అక్షౌహిణి. అటువంటి పద్ధెనిమిది అక్షౌహిణులతో కురుపాండవులు యుద్ధం చేయటం వల్ల ఆ శమంతపంచకానికి కురుక్షేత్రమనే పేరు వచ్చింది. అలాంటి కురుక్షేత్రంలో.)

No comments: