Sunday, August 28, 2005

1_1_128 వచనము వంశీ - విజయ్

వచనము

అని యడిగిన వారికి సక్కథకుం డిట్లని చెప్పెఁ దొల్లి సర్పకులజననియైన
కద్రువశాపంబు కారణంబునంజేసి జనమేజయు సర్పయాగంబున సర్వభక్షకుం
డైన యగ్నియందు సర్పంబులకెల్ల నకాండ ప్రళయంబైన దాని భృగువంశ
జుండైన రురుండు గావించు సర్పఘాతంబు సహస్రపాదుం డుడిగించినట్లు
జరత్కారుసుతుండైన యాస్తీకుం డుడిగించె దీని సవిస్తరంబుగాఁ జెప్పెద
వినుండని భృగువంశ కీర్తనంబు నాస్తీకుచరితంబును జెప్పందొడంగె.









(అప్పుడు ఆ కథకుడు, 'పూర్వం సర్పకులానికి జనని అయిన కద్రువ ఇచ్చిన శాపం వల్ల అగ్నిలో అన్ని సర్పాలకూ ప్రళయం కలుగగా దానిని, భృగువంశసంజాతుడైన రురుడు చేసే సర్పఘాతాన్ని సహస్రపాదుడు మాన్పించినట్లు, జరత్కారు దంపతుల కుమారుడైన ఆస్తీకుడు మాన్పించాడు. ఇది వివరంగా చెపుతాను. వినండి', అని భృగువంశ కీర్తనం, ఆస్తీకుడి కథ చెప్పటం ఆరంభించాడు.)

No comments: