అని దీనవదనుండై యాక్రోశించువానికి నాకాశంబున నుండి యొక్క దేవ
దూత యిట్లనియె నయ్యా! కాలవశంబయిన నెవ్వరికిం దీర్చఁ దరంబుగా
దొక్క యుపాయంబు గలదు చేయనోపుదేనిఁ జెప్పెద వినుము నీ యాయు
ష్యంబునం దర్థం బిక్కన్య కిమ్మనిన రురుం డట్ల చేయుదు నని తన
యాయుష్యంబునం దర్థం బక్కన్యక కిచ్చిన నక్కోమలి దొల్లింటికంటె
నధికశృంగార సమన్వితయై విషనిర్ముక్త యయ్యె నట్లు దేవదూత ధర్మరా
జానుమతంబునఁ దన చెప్పిన యుపాయంబునం బ్రమద్వరను బంచత్వంబు
వలనం బాపె రురుండును దాని వివాహంబై యిష్టోపభోగంబుల ననుభ
వించుచు నుండి.

(అలా విలపిస్తున్న రురుడికి ఆకాశంనుండి ఒక దేవదూత, "అయ్యా! మరణాన్ని తొలగించటం సాధ్యం కాదు. అయినా ఒక మార్గముంది. నీ ఆయుర్దాయంలో సగం ఈమెకు ఇవ్వు" అని పలికాడు. రురుడు అందుకు సమ్మతించగా, ఆ దేవదూత యముని అనుమతితో ప్రమద్వరను మృత్యువునుండి ఉద్ధరించాడు. ఆమె ముందటికంటే ఎక్కువ సౌందర్యంతో విషం నుండి విముక్తి పొందింది. రురుడు ప్రమద్వరను వివాహం చేసుకుని సుఖంగా ఉండి.)
No comments:
Post a Comment