నీవలనం బరమసం ప్రీతిహృదయుండ నయితి నీవును గుర్వర్థంబునందు ఋణ విముక్తుండవయితివి నిజేచ్ఛనుండు మనినఁదదనుజ్ఞ వడసి యుదంకుండనేకకాలంబు దపంబు సేసె నట్టి యుదంకుండు తక్షకు చేసిన యపకారంబునకుం బ్రతీకారంబు సేయం జింతించి యెక్కనాఁడు జనమేజయమహీపాలు పాలికిం బోయి యిట్లనియె.

(గురుకార్యం చేయటం వల్ల నువ్వు ఋణవిముక్తుడివి అయ్యావు, ఇక నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు, అనగా ఉదంకుడు పైలుడి అనుమతితో చాలాకాలం తపస్సు చేశాడు. తరువాత ఒకరోజు ఉదంకుడు తనకు తక్షకుడు చేసిన అపకారానికి ప్రతీకారం చేయనాలోచించి మహారాజైన జనమేజయుడి వద్దకు వెళ్లి ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment