Tuesday, August 30, 2005

1_1_147 వచనము కృష్ణ - విజయ్

వచనము

దాని నెఱింగి కరుణాకలితహృదయులై గౌతమ కణ్వకుత్స కౌశిక శంఖ
మేఖల భరద్వాజ వాలఖిల్యోద్దాలక శ్వేతకేతు మైత్రేయ ప్రముఖులు ప్రమ
తియు రురుండును స్థూలకేశాశ్రమంబునకు వచ్చి విషవ్యపగతప్రాణ యై
పడియున్న యక్కన్యం జూచి దుఃఖితులై యుండ నచ్చోట నుండనోపక
రురుండు శోకవ్యాకులహృదయుండై యేకతంబ వనంబునకుం జని.








(ఈ విషయం తెలిసి గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, కౌశికుడు (విశ్వామిత్రుడు), శంఖుడు, మేఖలుడు, భరద్వాజుడు, వాలఖిల్యులు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు మొదలైన ప్రముఖులు, ప్రమతి, రురుడు స్థూలకేశుని ఆశ్రమానికి వచ్చి నేలపై పడి ఉన్న ప్రమద్వరను చూసి దుఃఖితులవగా రురుడు అక్కడ ఉండలేక శోకవ్యాకులమైన హృదయంతో ఒంటరిగా అడవికి వెళ్లి.)

No comments: