Sunday, August 28, 2005

1_1_132 వచనము ప్రవీణ్ - విజయ్

వచనము

పులోమయు నక్కొడుకు భృగుకులవర్ధను నెత్తికొని నిజాశ్రమంబునకు వచ్చె నంతకు ముందఱ నారక్కసునకు వెఱచి యక్కోమలి యేడ్చుచుంబోయినఁ దద్బాష్పధారాప్రవాహంబు మహనదియై తదాశ్రమసమీపంబునం బాఱిన దానికి వధూసర యను నామంబు లోకపితామహుండు సేసె నంతఁ గృతస్నానుండై భృగుండు సనుదెంచి బాలార్కుండునుంబోని బాలకు నెత్తికొనియున్న నిజపత్నిం జూచి యసుర సేసిన యపకారంబున కలిగి యయ్యసుర నిన్నె ట్లెఱింగె నెవ్వరు సెప్పిరనినఁ బులోమ యిట్లనియె.










(అప్పుడు పులోమ చ్యవనుడిని ఎత్తుకుని ఆశ్రమానికి తిరిగివచ్చింది. అంతకు ముందు ఆమె ఆ రాక్షసుడికి భయపడి ఏడుస్తున్నప్పుడు, ఆ కన్నీళ్ల ధార గొప్పనదై ఆశ్రమం దగ్గర ప్రవహించగా, ఆ నదికి బ్రహ్మ "వధూసర" అనే పేరు పెట్టాడు. తరువాత భృగుమహర్షి స్నానం చేసివచ్చి బాలసూర్యుని వంటి కుమారుడిని ఎత్తుకుని ఉన్న భార్యను చూసి, రాక్షసుడు చేసిన అపకారానికి కోపించి, "ఆ రాక్షసుడికి నువ్వెవరో ఎలా తెలుసుకున్నాడు? ఎవరు చెప్పారు?", అనగా పులోమ ఇలా అన్నది.)

No comments: