Saturday, August 27, 2005

1_1_79 వచనము సందీప్ - విజయ్

వచనము

అప్పరశురాముండు నిజనిశతకుఠారధారావిదళిత సకలక్షత్త్రరుధిరాపూర్ణం
బులుగా నేనుమడుంగులు గావించి తద్రుధిరజలంబులఁ బితృతర్పణంబు సేసి
తత్పితృగణప్రార్థన నుపశమితక్రోధుం డయ్యె దానన చేసి తత్సమీప ప్రదే
శంబు శమంతపంచకంబునాఁ బరగె మఱి యక్షౌహిణీ సంఖ్య వినుండు.








(ఆ పరశురాముడు తన గొడ్డలి చేత సంహరించిన క్షత్రియుల రక్తంతో అయిదు కొలనులు ఏర్పరిచి, ఆ రుధిరజలంతో పితృతర్పణం చేసి, తన పితృదేవతల ప్రార్థనచేత తన కోపాన్ని ఉపశమింపజేశాడు. అందువల్ల ఆ స్థలానికి శమంతపంచకం అనే పేరు కలిగింది. ఇక అక్షౌహిణి అంటే ఏమిటో వినండి.)

No comments: