ఆక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నాదియుగంబునం గశ్యప
ప్రజాపతి భార్యలైన కద్రువయు వినతయు ననువారలు పుత్త్రార్థినులై
యనేకసహస్రవర్షంబులు కశ్యపునారాధించినం గశ్యపుండును బ్రసన్నుండై
మీ కోరిన వరంబు లిచ్చెద వేఁడుం డనిన.

(ఆ కథకుడు శౌనకాదిమునులకు ఇలా చెప్పాడు. కృతయుగంలో కశ్యపప్రజాపతి భార్యలైన కద్రువ, వినతలు పుత్రులకోసం చాలాకాలం కశ్యపుడిని ఆరాధించగా, అతడు ప్రసన్నుడై మీరు కోరిన వరాలు ఇస్తాను కోరుకొమ్మనగా.)
No comments:
Post a Comment