సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకవితార్థయుక్తి లో
నారసి మేలు నా నితరు లక్షరరమ్యత నాదరింప నా
నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారతసంహితారచనబంధురుఁ డయ్యె జగద్ధితంబుగన్.

(కవీంద్రులు ప్రసన్నకథాకవితార్థయుక్తిని ప్రశంసించగా, ఇతరులు అక్షరరమ్యతను ఆదరింపగా, ఎన్నో మంచి అర్థాలతో కూడిన సూక్తులకు నిధి అయిన నన్నయ తెలుగులో మహాభారతరచనాబంధురుడైనాడు.)
No comments:
Post a Comment