Saturday, August 27, 2005

1_1_65 వచనము సందీప్ - విజయ్

వచనము

మఱియు యాదవులెల్ల మదిరాపానపరవశు లయ శాపనిమిత్తంబున సముద్రతీరంబునఁ దమలోఁ బోరి పొడిచికొని పరలోకగతు లగుటయు దాని నెఱింగి రామకృష్ణాదియాదవ విరహితంబయిన ద్వారవతి కర్జునుం డరిగి విషణ్ణచిత్తుండయి వసుదేవాది యాదవులనెల్ల సంస్కరించి యాదవకళత్రంబుల నెల్లఁ దోడ్కొని వచ్చుచో గాండీవదివ్యబాణంబులశక్తి దఱిఁగిన వనచరభయంబువలనఁ దత్కళత్రంబుల రక్షింప నోపమియు నర్జునుండు ధర్మరాజుకడకు వచ్చి వ్యాసవాక్యప్రబోధితుండై సన్న్యసించుటయు నను వృత్తాంతంబుల నొప్పి మున్నూఱు శ్లోకంబులు గలిగి పదియాఱవ పర్వంబై మౌసలపర్వం బునాఁ బరగె మఱియుఁ బరీక్షిద్రాజ్యాభిషేకంబును రాజ్యపరిత్యాగము సేసి పాండవు లేవురు ద్రౌపదీసహితులై పరమసిద్ధికిం జనుటయు నను వృత్తాంతంబుల నొప్పి నూటయిరువది శ్లోకంబులు గలిగి పదియేడవ పర్వంబై మహాప్రస్థానికంబునాఁ బరగె. మఱియుఁ గర్ణు నరకప్రాప్తియుఁ దన్మోక్షణంబును స్వర్గంబున భారతవీరుల సంగమంబును గర్మపరిపాకోపభోగంబు నను వృత్తాంతంబుల నొప్పి యిన్నూఱు శ్లోకంబులు గలిగి పదునెనిమిదవ పర్వంబై స్వర్గారోహణంబునాఁ బరగె ని ట్లష్టాదశపర్వంబులు గలిగి.



















(300 శ్లోకాలతో మౌసలపర్వం భారతంలోని పదహారవ పర్వం, 120 శ్లోకాలతో మహాప్రస్థానికం పదునేడవది, 200 శ్లోకాలతో స్వర్గారోహణం పదునెనిమిదవది అవుతున్నాయి.)

No comments: