Thursday, August 25, 2005

1_1_28 సీసము + ఆటవెలది విజయ్ - సందీప్

సీసము

నైమిశారణ్యపుణ్యక్షేత్రమునఁ గుల
        పతి శౌనకుండను పరమమౌని
బ్రహ్మర్షి గణసముపాసితుండై సర్వ
        లోకహితార్థంబు లోకసుతుఁడు
ద్వాదశవార్షికోత్తమసత్రయాగంబు
        మొగిఁ జేయుచున్న నమ్మునులకడకు
వచ్చి తా నుగ్రశ్రవసుఁడను సూతుఁడు
        రౌమహర్షణి సుపౌరాణికుండు

ఆటవెలది

పరమభక్తితోడఁ బ్రణమిల్లి యున్న
నక్కథకువలన మునినికాయ మెల్ల
వివిధపుణ్యకథలు వినువేడ్క నతనిఁ
బూజించి రపరిమితవిశేషవిధుల.

















(నైమిశారణ్యంలో కులపతి అయిన శౌనకుడనే గొప్పముని పన్నెండు సంవత్సరాలు జరిగే సత్రయాగం చేస్తుండగా, రోమహర్షణుని కుమారుడు, పౌరాణికుడు అయిన ఉగ్రశ్రవసుడనే సూతుడు ఆ శౌనకాదిమునుల వద్దకు వచ్చి నమస్కరించగా, ఆ కథకుని ద్వారా వివిధపుణ్యకథలు వినాలనే ఆసక్తితో ఆ మునులంతా అతన్ని అనేకవిధానాలలో పూజించారు.)

No comments: