ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని
యధ్యాత్మవిదులు వేదంత మనియు
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రం బని
కవివృషభులు మహాకావ్య మనియు
లాక్షణికులు సర్వలక్ష్యసంగ్రహ మని
యైతిహాసికు లితిహాస మనియుఁ
బరమపౌరాణికుల్ బహుపురాణసముచ్చ
యం బని మహిఁ గొనియాడుచుండ
ఆటవెలది
వివిధవేదతత్త్వవేది వేదవ్యాసుఁ
డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై
పరుగుచుండఁ జేసె భారతంబు.

(ఎంతోమంది ఎన్నోరకాలుగా ప్రశంసించే భారతాన్ని గొప్పవాడు, పరాశరుని పుత్రుడు అయిన వేదవ్యాసుడు రచించాడు.)
No comments:
Post a Comment