అమలసువర్ణశృంగఖురమై కపిలంబగు గోశతంబు ను
త్తమబహువేదవిప్రులకు దానము సేసిన తత్ఫలంబు త
ధ్యమ సమకూరు భారతకథాశ్రవణాభిరతిన్ మదీయచి
త్తము ననిశంబు భారతకథాశ్రవణప్రవణంబ కావునన్.

(ఎంతో పుణ్యం చేసిన ఫలితం భారతకథను వినే ఆసక్తిచేత కలుగుతుంది. నా హృదయం కూడా ఈ కథను వినాలని కుతూహలపడుతూ ఉంటుంది. కాబట్టి)
No comments:
Post a Comment