సాత్యవతేయవిష్ణుపదసంభవమై విబుధేశ్వరాబ్ధి సం
గత్యుపశోభితం బయి జగద్విదితం బగు భారతీయ భా
రత్యమరాపగౌఘము నిరంతరసంతతపుణ్యసంప దు
న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్.

(ఈ పద్యంలో నన్నయ మహాభారతాన్ని ఆకాశగంగగా వర్ణించాడు. విశేషణాలను రెండిటి పరంగానూ అన్వయించుకోవచ్చు. సత్యవతీ పుత్రుడైన వ్యాసుని వాక్కు నుండి పుట్టినది(లేదా వ్యాసుడనే ఆకాశం(విష్ణుపదం) నుండి పుట్టినది), పండితుల స్నేహం చేత ప్రకాశించేది (లేదా సాగరసంగమం చేత ప్రకాశించేది) అయిన భారతం అనే గంగాప్రవాహాన్ని విన్నా, కొనియాడినా అందరికీ అభివృద్ధిని కలిగిస్తుంది.)
No comments:
Post a Comment